‘సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం చేదోయి సం ధింప’డనేదీ గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం. విష్ణువు గజేం ద్రుని కాపాడే తొందరలో లక్ష్మీదేవికి కూడా జెప్పక, శంఖు చక్రం లాంటి ఆయుధములను జేపట్టక బయలు దేరెనని ఆ శ్లోకం సారాంశం. వాస్తవానికి విష్ణువు అలా వెళ్లాడో లేదో మనకు తెలియదు గానీ… ఏదైనా ఒక సంఘటన జరిగిందని తెలిసిన మరుక్షణం… ఆగ మేఘాల మీద ఆ సంఘటనా స్థలికి చేరేవాడు జర్నలిస్టు. కలం పట్టిన సైనికుడు జర్నలిస్ట్. కలం పట్టినా, కెమెరా పట్టినా బాధితుల పక్షాన నిలుస్తాడు, అక్షరాలను తూటాల్లా పేల్చుతాడు. విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం ఫణంగా పెడతాడు. విత్తును మొలకెత్తించడానికి రైతు ఎంత శ్రమిస్తాడో… ఒక వార్తను ప్రపంచానికి తెలియజెప్పడానికి జర్నలిస్టూ అంతే శ్రమపడతాడు. ఒక్కోసారి సర్వశక్తులూ ఒడ్డి పోరాడ తాడు. రైతుది బతుకు పోరాటమైతే, జర్నలి స్టుది మంచిని బతికించాలనే ఆరాటం. మొన్ననే ‘వీక్షణం’ వేణుగోపాల్పై ఎన్ఐఏ వేధింపులు, ఆయన సెల్ఫోన్ గుంజుకున్నారు. కర్నూల్లో ఆంధ్రజ్యోతి విలేకరిపై రాజ కీయశక్తులు దాడి, హైదరాబాద్లో తులసీచందుపై సంఫ్ుపరివార్ ట్రోలింగ్. ప్రజల పక్షాన నిలబడే జర్నలి స్టులకు వేధింపులు కొత్తగాకపోయినా నేడు తీవ్రమైన విషయం అర్థమౌతూనే ఉంది.
గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారిం దని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ కాలంలో విధి నిర్వహణలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక వెల్లడించింది. అంత ర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యు లను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుకనే జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందేనని ఐరాస స్పష్టం చేసింది. నేడు జర్నలిస్టుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులు హత్యగావించబడ్డారని అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరే షన్ (ఐఎఫ్జె) వెల్లడించింది. గ్లోబల్ మీడియా వాచ్డాగ్ ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె)’ సమాచారం ప్రకా రం… దశాబ్ద కాలంలో 2023 జర్నలిస్టులకు ఘోరమైన సంవత్సరం. ఈ ఏడాదిలో 99 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో చనిపోయారు. ఇందులో 77 మంది గాజాపై ఇజ్రాయిల్ నరమేధాన్ని రిపోర్టింగ్ చేస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. తాజా లెక్కల ప్రకారం ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో మరణించిన జర్నలిస్టుల సంఖ్య 88కు పెరిగిందని సిపిజె తన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది. ఇజ్రాయిల్ సైన్యం డజన్ల కొద్ది జర్నలిస్టులను ఉద్దేశ పూర్వకంగానే చంపిందన్నది నిజమైతే అది ‘యుద్ధ నేరం’గా పరిగణించ బడుతుంది.
గాజాపై ఇజ్రాయిల్ దాడిలాంటిదే.. భారతదేశం లోనూ జర్నలిస్టులు, మేధావులపై నిరంకుశదాడి జరుగు తోంది. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వందలాది జర్నలిస్టులపై దేశద్రోహం, ‘ఉపా’ చట్టం కేసులు పె ట్టింది. ‘న్యూస్ క్లిక్ పోర్టల్’పై కేసులు నమోదు చేయిం చింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టించింది. పెగాసస్ స్పైవేర్తో 40మంది జర్న లిస్టులపై కేంద్రం పెట్టిన నిఘా కూడా బయట పడింది. అనేకమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంతోమంది మహిళా జర్నలిస్టులపైనా, వారి కుటుంబ సభ్యులపైనా, వారి ఇండ్లపైనా భౌతిక దాడులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత దేశం 2020లో 180 దేశాలలో 142వ స్థానంలో ఉంటే, 2023లో అది 161వ స్థానానికి దిగజారింది. ఇదీ మోడీ ప్రభుత్వంలో మీడియాకు దక్కిన గౌరవం. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన మీడి యాను ఎంతగా నరుకుతున్నారో కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తేనే అర్థమవుతుంది. లక్కింపూర్ఖేరీలో ఫొటో జర్నలిస్టు జీవితాన్ని బీజేపీ కేంద్రమంత్రి పుత్రరత్నం చిదిమేసిన ఘటన చూశాం. భాష్ప వాయుగోళాలను ఎదిరించి ముందుకు సాగే రైతాంగ డిమాం డ్లలో ఒక కీలక డిమాండు ఆ కిరాతకుడ్ని శిక్షించాలనేది.
జూలియన్ అసాంజే, ఎడ్వార్డ్ స్నోడెన్ వంటి సామాజ్య్రవాద దాష్టీకానికి బలౌతున్న స్థితి నేడు మనం చూస్తున్నాం.అల్జజీరా జర్న లిస్టులు ఇజ్రాయిల్ బాంబ్ దాడిలో మరణి స్తున్న తీరు చూస్తున్నాం. అయినా గన్నులకు పెన్నులు వణకవని, వెనక్కి తగ్గవని రుజువవు తూనే ఉంది. రుజువు చేయడమే జర్నలిస్టు కర్తవ్యం. ‘యుద్ధ రంగంలో నిలబడి/ కవిత్వం రాయడం గొప్ప ఆనందా న్నిస్తుంది’ అంటాడో కవి. నిరంకుశత్వం పెరిగేకొద్దీ జర్నలిస్టు కలం, కెమెరా కూడా తన వాడి పెంచుతుందే తప్ప వెనక్కి తగ్గదు.