ఆలయ నిర్మాణానికి 50 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఇమ్మడి గోపి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన నూతన శివాలయం నిర్మాణానికి తనవంతుగా 50వేల రూపాయలను దర్పల్లి మాజీ ఎంపిపి, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి అలయ కమిటీ, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈసందర్బంగా ఇమ్మడి గోపి మాట్లాడుతూ తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన యువకులు గల్ఫ్ లో ఉండి డబ్బులను పోగు చేసుకుని లక్షలాది రూపాయలు అలయ నిర్మాణానికి పంపించడం అభినందన మన్నారు. ఇదే కాకుండా గ్రామస్తులు, ఇతరులు తమకు తోచిన విధంగా సహాయం అందజేస్తున్నరని గ్రామ యువకులు, విడిసి సభ్యులు కలిసి విన్నవించినా వేంటనే ఆలయం వద్దకు వచ్చి పనులు చుసి తనవంతుగా 50వేల రూపాయలను అందజేసినట్లు ఇమ్మడి గోపి వివరించారు. సహయం అందజేయడం పాట్లా పలువురు హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love