కేసీఆర్.. నిన్ను, నీ పార్టీ నీ మూడు నెలల్లో బొంద పెడతాం

– కాంగ్రెస్ ను టచ్ చేస్తే బిఆర్ఎస్ పునాదులు వుండవు 
 – కవిత జైలుకుపోయినా  మీకు బుద్ధి రాలేదా?
 – ధైర్యం లేకనే అసెంబ్లీకి దూరం
 – ఎన్నికల్లో 14 సీట్లు మావే
 – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
 కెసిఆర్ నిన్ను.. నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా  బొంద పెడతాం. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బిఆర్ఎస్ కు  పునాదులు వుండవు. కవిత జైలుకుపోయిన మీకు ఇంకా బుద్ధి రాలేదా  అంటూ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవస్తాయిలో  ధ్వజమెత్తారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ తన చుట్టూ తన వాళ్లను పెట్టుకొని ఫోన్ టాపింగ్ చేసి ఇంట్లో  భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేవి   విని దేశంలో ఎక్కడ లేని దరిద్రమైన పాలన అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని  ఏడాదిలో  ఎలా పగలగొడతావు? దోపిడీ దొంగ వై మా ఎమ్మెల్యేలను  కొనాలనుకుంటున్నావా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మూడు నెలల్లో నీ పార్టీని రాజకీయంగా బొంద పెడతావని  హెచ్చరించారు. మేము తలుచుకుంటే మీ బంధువులు ముగ్గురు, నలుగురు తప్ప ఎవరు ఉండరని  అన్నారు. నువ్వు ఓ పాస్ పోర్ట్ దొంగవు. నువ్వు సీఎం కాగా లేనిది కష్టపడి సీఎం పదవిని అలంకరించిన రేవంత్ రెడ్డికి నీకు పోలికా అంటూ ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డికి మొఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు అయితే సమావేశాలకు రాని దొంగవు నువ్వు. నువ్వు.. నీ కొడుకు నీ అల్లుడి తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ ను  చూస్తే జాలేస్తుందని  అయినా బుద్ధి రాలేదని   అన్నారు.  మేం తలచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరేవారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా మీ పార్టీకి రాదని మంత్రి ఈ సందర్భంగా సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని, జూన్ 5 తారీఖు నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని  అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తాం. 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇళ్లయిన కట్టి ఇచ్చావా.. ఒక రేషన్ కార్డు అయినా మంజూరు చేసావా అసలు పేదల కోసం ఒక్క మంచి పనైనా  చేశావా కెసిఆర్  అంటూ  మండి పడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ఎఎమ్మార్పీ, బ్రాహ్మణ వెళ్దాం ల కోసం 3000 కోట్లతో పనులు నడుస్తున్నాయని ఆగస్టు నెలలోపు కాలువలు కూడా తీసి 2200  కోట్లతో అదనంగా సొరంగాన్ని పూర్తిచేసి నీటి సమస్యకు పరిష్కార చూపబోతున్నామని అన్నారు.విటమిన్ డీ తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తల పెట్టి ఉద్యమం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి నేను వెళ్ళాక రైతుల ధాన్యం 2500 కొన్నారు. కవిత జైలుకు పోయాక కేసీఆర్ కు మెంటల్ ఎక్కింది. రేవంత్ బీజేపీలోకి పోతున్నారని తప్పుడు ప్రచారం  చేస్తున్నారు. రెండేళ్లయినా కవితకు బెయిల్ రాదు.
తింటానికి తిండి లేని జగదీశ్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలి.అసెంబ్లీ కి రావడానికి నీకు మొఖం రావట్లేదు.ఎన్ని కుట్రలు చేసిన పసిగట్టుతాం.మీ కుటుంబానికి సరిపోయే డబల్ బెడ్ రూమ్ ఇల్లు చర్లపల్లి జైల్లో కట్టిస్తాం అని పేర్కొన్నారు.2 లక్షల రుణమాఫీ కి కట్టుబడి ఉన్నాం. కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడుతాం అంటున్నారు.రేపటి నుండి మేమూ వెంటాడుతాం అని పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love