అర్హులకు ఇండ్లు అందించకుంటే నిరాహార దీక్ష చేపడుతా: మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో నిజమైన అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ కనుసైగల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని అన్నారు. గత 20 రోజుల క్రితం ఎంక్వయిరీ చేయాలని సూచించిన పట్టించుకోవడంలేదని, వర్షాలకు బాధితులు ప్రజా ప్రతినిధులను సంప్రదించగా, తాత్కాలిక పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించడం సరైనది కాదని, పూర్తిగా ఎంక్వయిరీ చేసి బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించకపోతే బాధితుల పక్షాన ఆందోళనలు చేపట్టి, నిరాహార దీక్షలకు కూడా వెనుకడుగు వేయమని హెచ్చరించారు.
Spread the love