– తెలంగాణ నర్సెస్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్ల వేతన స్కేళ్లను స్థిరీకరించాలని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షురాలు జయమ్మ, ప్రధాన కార్యదర్శి మరియమ్మ, ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రుఢావత్ తదితరులు శుక్రవారం హైదరాబాద్లో పీఆర్సీ చైర్మెన్ శివశంకర్ను కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్లు ప్రధానంగా వైద్యారోగ్యశాఖతో పాటు కార్మిక, సంక్షేమశాఖ (గురుకులాలు) తదితర శాఖల్లో వివిధ హౌదాలు, క్యాడర్లలో పని చేస్తున్నారని తెలిపారు. నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు పెరిగాయనీ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అలవెన్స్ను పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.