ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను సాధిస్తున్నాయి. తాజాగా ‘ఆదికేశవ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన
ఈ చిత్ర యాక్షన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రీసెంట్గా రిలీజైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు చిత్ర బందం శుక్రవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా ప్రేమికులను అలరించేలా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.