ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి

కొచ్చి : రాబోయే ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు కర్నాటక ఫలితాలు ఊతమిచ్చాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాలలో . అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇతర బీజేపీ యేతర పక్షాలు బీజేపిని ఓడించే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితమే కర్నాటకలో బీజేపీ ఓటమి అని చెప్పారు. ఎన్నికలలో ఓటమి చెందినా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ చేసే ప్రయత్నాల పట్ల జాగరూకతతో ఉండాలని కాంగ్రెస్‌కు పినరయి సూచించారు

Spread the love