– హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని తెలిపారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ప్రభాకర్రావును పట్టుకోవడంలేదనే వార్త అవాస్తవమన్నారు. ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదని, సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామన్నారు.