నవతెలంగాణ-కాప్రా
మహిళతో పాటు మరో వ్యక్తిపై వీధి కుక్కల దాడి చేసిన ఘటన కాప్రాలోని శివ సాయి నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన అంజమ్మ శివ సాయి నగర్కు తన కూతురు ఇంటికి వచ్చింది. గురువారం ఆమె ఇంటిముందు కూర్చుని ఉండగా వీధి కుక్క దాడి చేశాయి. మహిళ కుడి కాలుపై రెండు చోట్ల తీవ్రంగా కరిచాయి. దాంతో ఆమెకు రక్తస్రావం జరగగా చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించి ఇంజక్షన్లు వేయించారు. ఇదే కాలనీలో మైసమ్మ గుడి దగ్గర ట్యూషన్ వద్దకు తన కుమారుడిని తీసుకువెళ్లేందుకు దమ్మాయిగూడ ఎల్ఎన్ఆర్ కాలనీకి చెందిన వ్యక్తి రాగా అతనిపై మరో వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్, వన్యప్రాణి విభాగం అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.