దేశాన్ని కార్పొరేటర్లకు కట్టబెడుతున్న బిజెపిని గద్దె దించాలి

 బిజెపిని ఎదుర్కొనే సత్తా ఎర్రజెండాకే ఉంది
 సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ముదిగొండ
పేదవాడి కష్టంతోనే ప్రపంచం బతుకుతుందని, పేదవాళ్లు తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చేస్తారని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలపరిధిలో చిరుమర్రిలో కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి బహిరంగసభ సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి సామినేని రామారావు అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగింది. ఈసభలో ఆయన మాట్లాడారు. అణిచివేత, వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన సుందరయ్య వ్యక్తి కాదు మహాశక్తి అన్నారు.ఎర్రజెండా ఉన్నంతవరకు భూపోరాటాలు ఉంటాయన్నారు. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న బిజెపిని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు.బిజెపిని ఎదుర్కొనే సత్తా ఎర్రజెండాకే ఉందన్నారు. చిరుమర్రి గ్రామం ఉద్యమాలకు పేరొందిన గ్రామమని,చైతన్యవంతమైన యువత, యువకులు,ప్రజలు ఎర్రజెండాకు అండగా ఉండాలని ముందుకు రావటం హర్షనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం జిల్లాలో సిపిఐ(ఎం) సత్తా చాటాలన్నారు మిగతా పార్టీల కంటే ఎర్రజెండా పార్టీలో ఉన్న వారికే గౌరవం దక్కిందన్నారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మతోన్మాద అరాచక శక్తులను ఎర్రజెండాతోనే తరిమికొట్టాలన్నారు. సభలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బుగ్గవీటి సరళ, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్‌, పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్‌, నాయకులు బండి పద్మ, మచ్చా లక్ష్మీ, రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, నాయకులు టీఎస్‌ కళ్యాణ్‌, మందరపు వెంకన్న, కోలేటి ఉపేందర్‌, ఎంపీటీసీ సభ్యురాలు కోలేటి అరుణ, వేల్పుల భద్రయ్య, బట్టు రాజు, సామినేని రాంబాబు, మోర రామకృష్ణ, మోర రామారావు, నల్లగొండ యల్లేశ్వరరావు, మహిళలు పార్టీ కార్యకర్తలు,యువతీ,యువకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love