సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
సబ్బండ వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని, రాష్ట్రంలో బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంజురైన ప్రోసెడింగ్ పాత్రలను అందజేశారు. డిచ్ పల్లి మండలంలోని సాంపల్లి గ్రామానికి సంబంధించిన అంగన్వాడి భవనానికి ₹ 5 లక్షలు, మహిళా భవనానికి ₹ 10 లక్షల రూపాయల పత్రలను పత్రాలను వివిధ మహిళ సంఘ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, సంక్షేమమే కాకుండా అభివృద్ధి కి వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ,ఉప సర్పంచ్ చిక్కెల మోహన్, మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love