నసురుల్లాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నందుపాటల్  

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నందు పటేల్ ను రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ ను మరో సారి అవకాశం ఇవ్వడం పట్ల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నందు పటేల్  మాట్లాడుతూ.. మండలం లో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు తప్పని సరిగా గుర్తింపు లభిస్తుందన్నారు,  ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని చేస్తే ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని తెలియజేశారు. అలాగే నూతనంగా మండల అధ్యక్షులుగా నియమితులైన నందు పటేల్ కు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
Spread the love