ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

– బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మెన్‌ బిలకంటి చంద్రశేఖర్‌ రెడ్డి
– సింగారంలో శ్రీ మల్లన్న ఆలయ ప్రారంభోత్సవంలో పూజలు
– ఆయనను సన్మానించిన గ్రామ పెద్దలు
నవతెలంగాణ-యాచారం
ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాం తత లభిస్తుందని బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మెన్‌ బిలకంటి చంద్ర శేఖర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిం గారంలో శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న ఆలయ ప్రారం భోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న విగ్రహ ప్రతిష్టోత్సవం శ్రీ పరిశుద్ధ నంద స్వామి, రేవెల్లి రాజు శర్మ, మాడుగుల అరవిందు శర్మ, ఆనంద్‌ శర్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రారం భోత్సవ వేడుకల్లో బీఎన్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మెన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామపెద్దలు ఆయనను ఘ నంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ..గ్రామం లో భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించడం సంతోషకరమై న విషయమన్నారు. కొత్తగా నిర్మించే ఆలయాల నిర్మాణా నికి తాను అండగా ఉంటానన్నారు. శ్రీ మల్లన్న పండు గను గ్రామంలో నిర్వహిస్తున్న వారందరికీ ఆయన అభి నందనలు తెలిపారు. కార్యక్రమంలో కొంగళ్ళ జోగి రెడ్డి, గుండ్లపల్లి ప్రవీణ్‌ రెడ్డి, రెడ్డి మల్ల సురేందర్‌ రెడ్డి, ఆదిరెడ్డి హరీష్‌ రెడ్డి, ఆదిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి, ఇంద్రసే నారెడ్డి, నర్సిరెడ్డి, రాజు, గణేష్‌, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Spread the love