‘జరగండి జరగండి జాబిలమ్మ జాకెట్టెసుకొచ్చెనండి’ అంటూ ప్రేమికురాలు కియారా అద్వానీని చూసి హీరో రామ్ చరణ్ పాట పాడితే వినటానికి మనసుకి ఉత్సాహంగా ఉంటుంది. మరి దాన్ని సిల్వర్ స్క్రీన్పై శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవనేంత గొప్పగా ఉంటుందనటంలో సందేహం లేదు. రామ్ చరణ్, కియారా ఆటా పాట, తమన్ సంగీతం, శంకర్ మేకింగ్ స్టైల్లో వావ్ అనేలా తెరకెక్కిన ఈ పాటను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై జీ స్టూడియోస్ అసోసియేషన్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బుధవారం రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జరగండి’ అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. 150 పైన థియేటర్స్లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించటం విశేషం.