– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
కారు గుర్తుకు ఓటేసి కాసానిని గెలిపించాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గ్రామాధ్య క్షుడిగా శేరి నర్సింలు, ఉపాధ్యక్షులుగా కావలి మాణిక్యం, ప్రధాన కార్యదర్శిగా తంగడపల్లి శ్రీని వాస్, కోశాధికారిగా కుమ్మరి శంకరయ్య, బీఆర్ఎస్ రావులపల్లి గ్రామ సలహాదారులు పట్లోళ్ల పెంటరెడ్డి, బీఆర్ఎస్ రావులపల్లి యూత్ కమిటీ అధ్యక్షులుగా బూర్లా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా బ్యాగరి సురేందర్, ప్రధాన కార్యదర్శిగా కేసారం కార్తీక్, కోశాధికారిగా కర్రే మధుసూదన్గౌడ్, మహిళా మండల జనరల్ సెక్రెటరీ పట్లోల్ల గీతారెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కేసారం శ్రీనివాస్యాదవ్, గ్రామస్తులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.