2010 దశకం లో అమెరికా ట్రాన్స్ రైట్స్ కార్యకర్త రేచెల్ క్రాండల్, మిచిగాన్ నుండి ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 31 అంతర్జాతీయ ట్రాన్సజెండర్ విజిబిలిటీ దినంగా పాటించే సంప్రదాయం మొదలయింది. సమాజంలో ట్రాన్సజెండర్ వ్యక్తుల పట్ల జరిగే వివక్షత, హింస, అసమానత, అస్పశ్యతలకు వ్యతిరేకంగా ఒక బలమయిన సమిష్టి స్వరంతో పాటుగా సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పై ఉన్న అనుమానాలు, భయాలు, భ్రాంతులు పారద్రోలి వారికి కూడా సమానంగా స్వేచ్ఛ స్వాతంత్రాల వాతావరణం సష్టించాలి అనే దక్పథంతో ఈ రోజును పాటించటం ప్రారంభమయింది.
ఈ నేపధ్యంలో తెలంగాణ లో ప్రవిఢవిల్లిన LGBTQIH ఉద్యమంలో ట్రాన్స్ విప్లవం యొక్క అభివద్ధి దాని పుట్టుక, ట్రాన్సు సముదాయ జీవనం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ సాంస్కతిక అభివద్ధికి సంబంధించిన మార్పులు చేర్పులు సర్దుబాట్లు ఇవన్నీ ఈ వ్యాసంలో విశ్లేషించటానికి ప్రయత్నించాను…
ధర్నా చౌక్, స్వాభిమాన సభ అక్టోబర్ 10, 2015
2014 సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నల్సా వెర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా తీర్పు – వెలువడిన తర్వాత 2014 లోనే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భవించడం, తెలంగాణ పోరాటం లో పాలుపంచుకున్న అనేకమంది ట్రాన్స్ హిజ్రా వ్యక్తులు అందరిలాగే వారికి బంగారు రోజులు వొస్తాయని ఆశించటం జరిగింది … దశాబ్దం కన్నా ఎక్కువ కాలం నడిచిన వారి తెలంగాణ పోరాట భాగస్వామ్యం మరియు సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా వెలువరించిన తీర్పు అధికారంలోకి వొచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆ తీర్పును అమలు చేస్తారనే ఆశతో స్వాభిమాన సభకి విచ్చేసిన 3000 పైగా ట్రాన్స్ హిజ్రా కార్యకర్తలు ఒక మెమోరాండం అప్పటి రాష్ట్ర మంత్రి అయినా ఈటెల రాజేంద్రకి సమర్పించటం జరిగింది స్వాభిమాన సభ ఒక విధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిఫలాలలో ట్రాన్సువారి ఉనికిని చాటి చెప్పే ఒక సామూహిక కూటమి ఏ కాదు సుప్రీమ్ కోర్ట్ యొక్క జడ్జిమెంట్ ను అమలు చేయాలనీ కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే ఒక సందర్భం కూడా. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వాసులయిన ట్రాన్స్ హిజ్రా వారే కాకా వారికీ సంఘీభావం తెలిపే ఇతర అణగారిన వర్గాల ప్రజా సంఘాలు, కూటములు, కలెక్టివ్లు, అనేక సివిల్ సొసైటీ సంస్థలు అడ్వొకేట్లు, అక్టీవిస్ట్స్, విద్యార్థి సంఘాలు అందరూ విచ్చేయటమే కాకుండా కచ్చితంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో టాన్స్ హిజ్రా వారిని కూడా భాగస్వాములు చేయాలనీ చెప్పటం జరిగింది.
తెలంగాణ హిజ్రా ఇంటర్సెస్ ట్రాన్స్జెండా సమితి: స్వాభిమాన సభ జరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా బిక్షాటన మరియు సెక్స్ వత్తిలో ఉన్న ట్రాన్స్ హిజ్రా వారు ఎదుర్కునే రోజు వారి హింస మరియు వివక్షను ఎదుర్కోవటానికి సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును ఒక ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో ఏర్పడిన ఒక కలెక్టివ్ ఏ తెలంగాణ హిజ్రా ఇంటర్ సెక్స్ ట్రాన్స్జెండర్ సమితి. తెలంగాణ హిజ్రా ఇంటర్ సెక్స్ ట్రాన్స్జెండర్ సమితి ఒక కలెక్టివ్ మాత్రమే, దీనిని కావాలనే రిజిస్టర్ చేయటం కానీ ఈ పనిని చేయటానికి కావలసిన ఫండ్స్ని కానీ ఎక్కడనుండి ఎవ్వరినుండి తీసుకోవడం జరగలేదు.. కేవలం అవరసరం అయిన చోట చందాల రూపంలో డబ్బును పోగుచేసి ఈ కలెక్టివ్లోని కార్యకర్తలు పని చేయటం జరిగింది. ఈ కలెక్టివ్లో పేరుకు తగ్గట్టే ట్రాన్స్జెండర్ వ్యక్తులు, హిజ్రా సమాజం నుండి కొందరు, ట్రాన్స్ మెన్/ మాస్క్యూలై వ్యక్తులు, ఇంటర్ సెక్స్ వ్యక్తులు ఇంకా కోతి/ జెండర్ ఖ్వీర్ వ్యక్తులు వంటి విభిన్న మైన ఐడెంటిటీలతో కార్యకర్తలు ఉండటమే కాకుండా పని చేయటం కూడా జరిగింది. రోజు వారి జరిగే హింసను అడ్రస్ చేసుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు తమ విధివిధానాలు, చట్టాలను ట్రాన్సు వ్యక్తుల శ్రేయస్సు కొరకు వర్తింపచేసేలా పని చేయటం ఈ కూటమి యొక్క పనులలో ఉండేది.
హైదరాబాద్ యునాక్స్ యాక్ట్న్ సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా నల్సా వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా తీర్పు అమలు పబ్లిక్ ఇంటెరెస్ట్గ్ లిటిగేషన్ ఈ క్రమంలోనే ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వ్యాజ్యాలు కొంతమంది ట్రాన్స్, హిజ్రా జెండర్ ఖ్వీర్ కార్యకర్తలు తెలంగాణ హైకోర్ట్లో వేయటం జరిగింది. దానికి సంబంధించిన నోటీసులు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్కి చేరటంతో వారు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కోసం ఏయే విధానాలు రూపొందించాలి వారి శ్రేయస్సు, అభివద్ధి, ఇంకా బాగోగుల కొరకు ఏం పని చేయాలని ఆలోచించేలా చేయటమే కాకుండా ఆ దిశలో పని చేయించే విధంగా కూడా అవి పనికొచ్చాయి
ట్రాన్స్ బిల్ 2016 / హిజ్రా తెహజీబ్ బచావో ఆందోళన్
ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ అఫ్ రైట్స్) యాక్ట్ 2019 రూల్స్ 2020 పబ్లిక్ ఇంటెరెస్ట్గ్ లిటిగేషన్ – కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఈ బిల్లు తయారు చేసేటప్పటికే తమిళనాడు రాజ్య సభ మెంబెర్ తిరుచ్చి శివ యొక్క ప్రైవేట్ మెంబెర్ బిల్ ట్రాన్స్ వ్యక్తుల కొరకు ప్రవేశపెట్టబడి ఆమోదం కూడా పొందింది కానీ ఆ బిల్లు ఎప్పుడూ లోక్ సభ చూడలేదు. ఈ లోపు కేంద్ర ప్రభుత్వం ఇంకొక పర్సనల్ బిల్లు మినిస్ట్రీ అఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అధ్వర్యంలో మంత్రి థావర్ గెహ్లాట్ ప్రైవేట్ మెంబెర్స్ బిల్ లా ట్రాన్స్జెండర్ బిల్లు 2016 ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులో ఎన్నో సైద్ధాంతిక లోపాలే కాక ముఖ్యంగా 2014లో సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా చెప్పినట్టు ట్రాన్స్జెండర్ వారిని సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన సముదాయాలుగా గుర్తించమని చెప్పిన ఉత్తర్వులను దష్టిలో పెట్టుకొని ఈ బిల్లు రచించలేదు పైగా భిక్షాటనం నేరంగా ప్రకటించి అడుక్కునే ట్రాన్స్ వారికీ అలాగే వారు ఎవరినైనా అడుక్కుని రమ్మని చెప్పిన అటువంటివారికి రెండు ఏళ్ళ జైలు శిక్షను సిఫార్సు చేయటం జరిగింది. అంటే ఈ బిల్లు ద్వారా ట్రాన్స్జెండర్ వారికి ఎటువంటి ఉపయోగం ఉండక పోగా వారిని శిక్షించే విధంగా ఉండడం అమానవీయం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మొట్టమొదటి సారిగా పోరాటానికి దిగింది తెలంగాణ గడ్డపై ఉన్న హిజ్రా పెద్దలు ..’హిజ్రా తెహజీబ్ బచావో’ అన్న నినాదంతో హైద్రాబాద్ నుండి మొదలు పెట్టిన ఈ విప్లవం ఎంతో తక్కువ సమయంలోనే అన్ని రాష్ట్రాలకు పాకటమే కాకుండా జాతీయ అంతర్జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందటం జరిగింది. WPATH ది వరల్డ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ హెల్త్ సంస్థ భారత ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఈ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. సవరించాల్సిందిగా కోరింది. 1000 పైగా సలహాలు సూచనలు మినిస్ట్రీ అఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ని తాకటం జరిగింది. దానికి అనుగుణంగా 2019 నాటికి ఈ బిల్లు చట్టం అయ్యేటప్పటికి కొన్ని మౌలిక మార్పులు డిపార్ట్మెంట్ చేయటం జరిగింది. కానీ ట్రాన్స్జెండర్ వారికి జరిగే వివక్షతను అభివర్ణించకపోవటం, అలానే చదువులో, ఉపాధిలో ట్రాన్స్జెండర్ వారికి ఎటువంటి రిజర్వేషన్ లేకపోవటం చాలా బాధాకరం. ఆ విషయం పైన రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొంతమంది ట్రాన్స్ అక్టీవిస్ట్లు ఈ చట్టాన్ని సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియాలో ఛాలెంజ్ చేశారు. చట్టం వచ్చాక 2020లో రూల్స్ కూడా గవర్నమెంట్ గెజిట్లో ప్రచురించారు. ఆ రూల్స్ కచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించవలసి ఉంది. కానీ ఆయా రాష్ట్రాలు ఇంకా దానికి సంబందించిన తయారీలోనే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం 2022లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీ.ఓ ద్వారా రాష్ట్ర ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ను స్థాపించటం జరిగింది.
తెలంగాణ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు : 2022 అక్టోబర్ మాసం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ఓ ద్వారా కొంత మంది ట్రాన్స్ హిజ్రా అక్టీవిస్ట్స్ తో తెలంగాణ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు స్థాపించటం జరిగింది. ఆ సమయంలో ఉన్న బోర్డు మెంబర్స్ మరికొంతమందిని బోర్డులో తీసుకొంటామని ప్రార్ధించగా, వేరే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ని కూడా అందులో జోడించమని అడుగగా కలపటం జరిగింది. తెలంగాణ కాబినెట్ నిర్ణయించిన 2 కోట్లు ట్రాన్సు హిజ్రా అభివద్ధి కొరకు కేటాయించాలని నిర్ణయించటం జరిగింది. తెలంగాణ ట్రాన్స్జెండా వెల్ఫేర్ బోర్డు ఆ దిశగా ప్రభుత్వానికి సహాయం చేయటం మొదలు పెట్టింది. ఈ రెండు కోట్లు కేవలం బిక్షాటన మీద, సెక్స్ వర్క్ మీద ఆధారపడి జీవించే ట్రాన్స్ హిజ్రా వ్యక్తులకు వేరే జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారికి, వ్యాపార నిమిత్తం అప్పులు ఇవ్వటం కోసం, నివసించడానికి గూడు లేని ట్రాన్స్ హిజ్రా వారికి ఒక హోమ్, ట్రాన్స్ హిజ్రా వారిపై వివక్షతను పోగొట్టటానికి ప్రచారం నిమిత్తం కొంత బడ్జెట్, అలానే ఆరోగ్యం, వివిధ ఐడెంటిటీ కార్డ్స్ తయారు చేయటానికి నిమిత్తం కొంత బడ్జెట్ కేటాయించటం జరిగింది.
ఉస్మానియా ట్రాన్స్ క్లినిక్ ట్రాన్స్ ఖ్వీర్ వెల్నెస్ సెంటర్ డ ట్రాన్స్ లీగల్ క్లినిక్ – 2021 లో యు యెన్ ఎయిడ్స్ సంస్థ అధ్వర్యం మిత్ర్ అనే పేరుతో కేవలం ట్రాన్స్జెండర్ వారికి సమగ్ర ఆరోగ్య విషయాలకు సంబంధించిన వైద్యం, సూచనలు సలహాలు కౌన్సిలింగ్ సేవలతో హైదరాబాద్లో ప్రారంభించబడింది. ఆ క్లినిక్ పనితీరు ట్రాన్స్ వారి ఆరోగ్య విషయాలలోనే కాక ఇతర అవసరాలు, ఆధార్ కార్డ్స్ చేపించటం, ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డ్స్ చేపించటం, వివిధ వ్యాపారాలు చేసుకోవటాని లోన్స్కి ట్రాన్స్ హిజ్రా వారికి సహాయం చేయటం, హింస, వివక్షకు సంబంధించిన విషయాలలో తక్షణ సహాయం వంటి క్రైసిస్ మానేజ్మెంట్ వంటి కొన్ని ప్రభావంతమయిన పనుల వలన వేరే సంస్థలు ట్రాన్స్ హిజ్రా వారి సహాయార్ధం కొన్ని వినూత్న ప్రాజెక్ట్స్ ఇవ్వటం జరిగింది. ఆ వరుసలో ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియాలో వారానికి ఒక రోజు ట్రాన్స్ క్లినిక్ కొరకు కేటాయించటం, జ్యూట్ బ్యాగ్స్ కుట్టటంలో శిక్షణ ఇచ్చి అందులో శిక్షణ పొందిన వారితో ట్రాన్స్ జ్యూట్ బ్యాగ్ ప్రొడక్షన్ యూనిట్ స్వాభిమాన స్ఫూర్తి అన్న పేరుతో ప్రారంభించి, అందులో 8 మంది ట్రాన్స్జెండర్ వారికి జీవనోపాథి కలిపించటం, అలానే ఇంటి నుండి తరిమి వేయబడిన ట్రాన్స్ వ్యక్తుల కొరకు తాత్కాలిక షెల్టర్ వాలే ఖ్వీర్ ట్రాన్స్ వెల్ఫేర్ సెంటర్, అదే సెంటర్లో వారానికి ఒక రోజు ట్రాన్స్జెండర్ హిజ్రా వారు ఎదుర్కొనే గహ హింస, హక్కుల ఉల్లంఘన వంటి పరిస్థితులలో ఉచిత న్యాయపరమయిన సహాయం కొరకు ప్రత్యేక ట్రాన్స్జెండర్ లీగల్ క్లినిక్ కూడా అదే ఖ్వీర్ ట్రాన్సు జెండర్ వెల్నెస్ సెంటర్లో ప్రారంభించారు. ఒక తెలంగాణ ట్రాన్స్ ఉద్యమంలోనే అమోఘమైన ఘట్టంగా అభివర్ణించొచ్చు. ఈ స్వాభిమాన స్ఫూర్తి ప్రత్యేక ట్రాన్స్ హిజ్రా జ్యూట్ బ్యాగ్ మేకింగ్ ప్రొడక్షన్ యూనిట్ స్ఫూర్తితో నిర్మాణ్ ఆర్గనైజేషన్, గౌరవ్ ఫౌండేషన్ సుమారు 200 ట్రాన్స్ హిజ్రా వారిని వేర్వేరు శిక్షణా కార్యక్రమాలలో… ఉదాహరణకు మేకప్, బట్టలు, జ్యూట్ బ్యాగ్లు కుట్టటంలో శిక్షణ పొందారు. 2024 సిడీబీ సంస్థ అదనంగా మరో 200 మందికి శిక్షణా కార్యక్రమాలు రాబోయే రోజులలో చేయనున్నారు.
ట్రాన్స్ మార్చ్ కలెక్టివ్ – 2014 నాటి నుండి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అమలు మొదలు ఇప్పుడు చదువులో, ఉద్యోగాలలో సమాంతర రిజర్వేషన్స్ కొరకు తెలంగాణ ట్రాన్స్ ఉద్యమం మిగిలిన ప్రజా ఉద్యమాలతో మమేకమై చాలా రూపాంతరం చెంది ఆ సముదాయాలకు అనేక లబ్ది చేకూర్చే పనుల సాధన కొరకు ఆ కమ్యూనిటీ అక్టీవిస్ట్లు కార్యకర్తలు నిరంతరం కోర్టు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రక్రియలో LGBTQIH సముదాయాలలో మిగిలిన జెండర్ మైనారిటీలు కానీ సెక్సువల్ మైనారిటీలు కానీ అందరి పోరాటాలు కలిసి ఏక శక్తిగా పొందుతూ వొచ్చేవి. కానీ కాలక్రమేణా అణగారిన, ముఖ్యంగా భిక్షాటన, సెక్స్ వత్తిపై ఆధారపడి ట్రాన్స్ మహిళలు, హిజ్రా మహిళల పట్ల ఒక విధమయిన వేర్పాటు భావజాలం, వారిపట్ల అలసత్వం, దూరం పెట్టటం వంటి భావాలు ఆ సముదాయాలను లోపల లోపల సంఘటితమయ్యే ఒక వాతావరణం కల్పించాయి. దీని పర్యావసానమే LGBTQIH వారందరూ ప్రతీ సంవత్సరం కలిసి చేసుకొనే ప్రైడ్ మార్చ్ 2022 ట్రాన్స్ హిజ్రా జెండర్ క్యూర్, శివ శక్తి, కిన్నెర సముదాయాలను వేర్వేరు కమ్యూనిటీ బేస్డ్ సంస్థలుగా ఆవిర్భవించి, వారి సముదాయాలకు వారే పని చేసుకునే దిశలో తెలంగాణ ట్రాన్స్ ఉద్యమం ముందుకు పోతుంది.
– రచన, 9866717712