సూపర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘గ్రంథాలయం’. వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర ట్రైలర్‌ను ప్రసాద్‌ ల్యాబ్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ‘ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆద్యంతం సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునే కథ కాదు నాది.. లాంటి డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫైట్స్‌ సీక్వెన్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ వాట్సాప్‌లలో వైరల్‌గా మారింది. ట్రేడ్‌ వర్గాల్లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్‌ జరుగుతుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. చిత్ర దర్శకుడు సాయి శివన్‌ మాట్లాడుతూ,’కల చెప్పిన కథే ఈ ‘గ్రంథాలయం’. నాకొచ్చిన కలను కథగా రాసుకున్నాను. సూపర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్‌ కాన్సెప్ట్‌ను కమర్షియల్‌గా ఫస్ట్‌ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఇందులో మాస్‌కి కావలసిన అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు రుణపడి ఉంటాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు చాలా మంచి పాటలు ఇచ్చారు. ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

Spread the love